
రెడ్క్రాస్కు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డు
పాలమూరు: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రెడ్క్రాస్కు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అందజేశారు. రాష్ట్రంలో 2024– 25 సంవత్సరానికి గాను మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో 7,589 యూనిట్ల రక్తం సేకరించి ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ అవార్డు అందుకున్నారు. రెడ్క్రాస్ నుంచి బ్లడ్ బ్యాంక్, సన్నిధి ఆశ్రమం, అక్షర పాఠశాల, శాంతివన్తోపాటు పేదలకు సేవలు అందిస్తోంది. కార్యక్రమంలో అశ్విని చంద్రశేఖర్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.