
ప్రజావాణికి 96 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను తిప్పుకోకుండా ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 25..
మహబూబ్నగర్ క్రైం: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిష్కరించాల ని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న 25 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యా దులు స్వీకరించారు. పోలీస్ సేవలను ప్రజల కు మరింత చేరువ చేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని సమీక్షించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.
డీసీసీబీ విశ్రాంత
ఉద్యోగుల కార్యవర్గం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ఎన్నికయ్యారు. ఈ మేరకు స్థానిక డీసీసీబీ ఆడిటోరియంలో సోమ వారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా రాంమోహన్, అబ్దుల్ వాసిక్, కార్యదర్శిగా రాములు, సహాయ కార్యదర్శిగా యాదగిరి, కోశాధికారిగా కుబేరుడు, కార్యవర్గ సభ్యులుగా సుధాకర్రెడ్డి, ఓఎన్ మూర్తి, సత్యనారాయణ, రాములు, చంద్రశేఖర్రెడ్డి, వెంకటరమణచారి, బాపయ్య, భీమయ్య, జగన్నాథ్గౌడ్లను ఎన్నుకున్నా రు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ ఎయిడ్ కోసం రూ.5 వేలను గ్రాంట్ చేసినందుకు డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డికి విశ్రాంత ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శాసీ్త్రయంగానే డివిజన్ల విభజన ముసాయిదా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నిబంధనల మేరకు శాసీ్త్రయంగానే డివిజన్ల ముసాయిదాను తయారు చేశామని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. గత జనవరి 27 నుంచి మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిందన్నారు. గతంలో ఉన్న 49 వార్డులతోపాటు దివిటిపల్లి, జైనల్లీపూర్ విలీనం కావడంతో ప్రస్తుతం 60 డివిజన్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం నగరంలో ప్రస్తుతం 1,96,602 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఒక్కో డివిజన్లో సరాసరిగా 3,200 మంది ఓటర్లు ఉండేలా విభజన ముసాయిదాలో పొందుపరిచామన్నారు. జీఓ 12లో సూచించిన మేరకు ఆయా డివిజన్ల నక్షాలతోపాటు హద్దులను రూపొందించామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 5న దినపత్రికలలో ముసాయిదాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అలాగే తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచామన్నారు. వీటిపై ఏమైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలుంటే ఈ నెల 11లోగా లిఖిత పూర్వకంగా నేరుగా అందజేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఆరు దరఖాస్తులు వచ్చాయని, గడువులోగా ఇంకేమైనా వస్తే అన్నింటినీ ఈ నెల 12 నుంచి 16 వరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో హద్దులు సరిగా.. ఉన్నాయో లేదో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం బృందం సరిచూస్తోందన్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని, 21న తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. సమావేశంలో ఏసీపీ కరుణాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 96 ఫిర్యాదులు