
టీజీపీఈసెట్కు సర్వం సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా డీపెడ్, డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న టీజీపీఈసెట్–2025 అర్హత పరీక్షకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పాలమూరు యూనివర్సిటీలో పరీక్షకు సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల నుంచి మొత్తం 2, 561 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈవెంట్స్ను బుధవారం ఉదయం 11గంటలకు రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం అర్హత పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు రాత్రి పీయూకు చేరుకోనున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బాలుర, బాలికలకు వేర్వేరు హాస్టల్స్లో వసతి ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను మంగళవారం పీయూ వీసీ శ్రీనివాస్, కన్వీనర్ దిలీప్ పీయూలోని సింథటిక్ ట్రాక్, పీజీ కళాశాల గ్రౌండ్, ఇండోర్ స్టేడియం పరిశీలించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
టీజీపీఈసెట్ పరీక్ష నిర్వహణకు అన్నిఏర్పాట్లు పూర్తి చేశాం. ఈవెంట్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీయూలో అథ్లెటిక్స్కి సింథటిక్స్ ట్రాక్ గ్రౌండ్, సాధారణ క్రీడలకు పీజీ కళాశాల గ్రౌండ్లో 11 కోట్లను ఏర్పాటు చేశాం. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు రాత్రికి ఉండేందుకు వివిధ హాస్టల్స్లో వసతి కల్పించాం. ఇప్పటికే హాల్టికెట్లను అభ్యర్థులకు జారీ చేశాం. అందులో సూచించిన తేదీలు, సమయం ఆధారంగా ఈవెంట్స్కు విద్యార్థులు రావాలి.
– దిలీప్, టీజీపీఈసెట్ కన్వీనర్
నేటినుంచి పీయూలో పరీక్ష ఈవెంట్స్ నిర్వహణ
రాష్ట్ర వ్యాప్తంగా హాజరుకానున్న 2, 561 మంది విద్యార్థులు
ప్రారంభించనున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి
పీయూలో ఏర్పాట్లను పరిశీలించినవీసీ శ్రీనివాస్, సెట్ కన్వీనర్ దిలీప్

టీజీపీఈసెట్కు సర్వం సిద్ధం