
గుడిబండ.. శోకసంద్రం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద రోడ్డు ప్రమాదం
అడ్డాకుల: బర్త్ డే సెలబ్రేషన్స్కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం మండలంలోని గుడిబండలో మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మృతులు, క్షతగాత్రులందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వాస శివకుమార్ అలియాస్ కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మంగళవారం అతడి బర్త్ డే ఉండటంతో అతనికి వరుసకు సోదరులయ్యే వాస పవన్కుమార్(25), వాస సాయితేజ (22), వాస రాఘవేంద్ర (23)తో పాటు సొంత తమ్ముడు సాయికుమార్, మూసాపేటకు చెందిన సందీప్, హైదరాబాద్కు చెందిన శివకుమార్గౌడ్ కలిసి ఉదయం కారులో హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వద్ద ఉన్న వైజాగ్కాలనీకి వెళ్లారు. వేడుకలు జరుపుకొని అర్ధరాత్రి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాస పవన్కుమార్, వాస సాయితేజ, వాస రాఘవేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. కుమార్, అతడి తమ్ముడు సాయికుమార్, సందీప్, శివకుమార్గౌడ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఒక్కగానొక్క కుమారుడు..
వాస బుర్రన్న, పద్మ దంపతులకు కుమారుడు వాస పవన్కుమార్, కుమార్తె ఉండగా. కుమార్తె వివాహం జరిగింది. పవర్కు భార్య వరలక్ష్మి, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. మధుమేహ వ్యాధి తీవ్రమై బుర్రన్నకు ఇటీవల కాలు తొలగించారు. పవన్ కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉంటూ భవన నిర్మాణాల వద్ద మిల్లర్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ పోషణ కాలు లేని తండ్రికి భారం కానుంది. పవన్ భార్య వరలక్ష్మి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి.
కారు డ్రెవింగ్కు వెళ్లి..
వాస బాలస్వామి, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు వాస సాయితేజ హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేస్తుండేవాడు. సోదరుడు రవితేజ బెంగళూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. సాయితేజకు ఇంకా పెళ్లి కాలేదు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆదుకుంటాడనుకుంటే..
వాస లక్ష్మయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. పెద్ద కుమారుడు వాస రాఘవేంద్ర ప్రైవేట్లో ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. హైదరాబాద్లో ఉంటున్న రాఘవేంద్రకు ఇంకా పెళ్లి కాలేదు.
ఘటనపై ఎమ్మెల్యే ఆరా..
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు తగిన సాయం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
గ్రామానికి చెందిన ముగ్గురి దుర్మరణం..
మరో నలుగురికి గాయాలు
బర్త్ డే వేడుకలు ముగించుకొని
వస్తుండగా ప్రమాదం

గుడిబండ.. శోకసంద్రం

గుడిబండ.. శోకసంద్రం

గుడిబండ.. శోకసంద్రం