
శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు’లో శిక్షణ పొందిన మహిళలకు 30 నుంచి 40 శాతం వరకు ఉద్యోగావకాశాలు లభించాయని పర్యవేక్షకుడు గుండా మనోహర్ తెలిపారు. ఇక మిగతా వారు ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలోని ఈ శిక్షణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సొంత నిధులతో కొనసాగుతున్న ‘నవరత్నాలు’ ముఖ్యంగా మహిళలకు వరంగా మారిందన్నారు. ఇక్కడ కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గంవర్క్, ఫ్యాషన్ డిజైనింగ్లో శిక్షణ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్లో 217 మంది, రెండో బ్యాచ్లో 247 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు యత్నిస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్ పూర్తి చేసిన వారికి ఈనెల 17న ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అదేరోజు రెండో బ్యాచ్ వారికి ఫేర్వెల్ పార్టీ ఉంటుందన్నారు. మూడో బ్యాచ్కు అడ్మిషన్లు జరుగుతున్నాయని 18న శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అలాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సైతం ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ నిజలింగప్ప, సెట్విన్ కో–ఆర్డినేటర్ విజయకుమార్, ‘నవరత్నాలు’ ఫ్యాకల్టీలు గౌతమి, భవాని, కవిత, అనూష తదితరులు పాల్గొన్నారు.
18 నుంచి మూడో బ్యాచ్ ప్రారంభం