
లోక్ అదాలత్తో రాజీ చేసుకోండి..
వివిధ కేసుల్లో రెండు వర్గాలు కొట్లాడుకుంటే ఒక్కరే గెలుస్తారు.. అదే లోక్ అదాలత్లో రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు. లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులకు తిరిగి హైకోర్టులో అప్పీల్ ఉండదు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. కక్షిదారులు రాజీపడ దగ్గ కేసులను రాజీ చేసుకోవాలి. సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. సివిల్ కేసులో ఇరుపార్టీలు రాజీ అయితే వారి కేసులలో కట్టిన కోర్టు ఫీజు తిరిగి ఇస్తాం.
– బి.పాపిరెడ్డి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి