
జిల్లాకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకు 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కేటాయించినట్లు మహబూబ్నగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర తెలిపారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని సారంగపాణిని వివిధ జిల్లాల అథ్లెటిక్స్ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ను కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శరతచంద్ర మాట్లాడుతూ మహబూబ్నగర్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల అథ్లెటిక్స్ సంఘాలు, ఇతర క్రీడా సంఘాల సహకారంతో జిల్లాకు కేటాయించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి వెంకటేశ్వర్రెడ్డి, నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, ఆయా జిల్లాల ప్రతినిధులు మనోజ్కుమార్ (జనగామ), యుగేంధర్రెడ్డి (వరంగల్), జగన్, రాజు, సోమశేఖర వాసుదేవరావు, సాంబమూర్తి, రజనీకాంత్, ఆనంద్, ఆవుల అశోక్, చంద్రశేఖర్రెడ్డి, నాగరాజు, మహేందర్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, కోచ్ సునీల్కుమార్ పాల్గొన్నారు.
విమాన దుర్ఘటన హృదయ విదారకం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద దుర్ఘటన హృదయ విదారకమని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం స్థానిక తెలంగాణ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పాటు మానవ తప్పిదాలతో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వేల కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించే విమానాల గమనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ఉపాధ్యక్షుడు ఎ.రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు కె.వి.అశోక్, కోటిరెడ్డి, వి.అనంత్రెడ్డి, జి.నాగభూషణం, లోకయ్య, సురేష్బాబు, బస్వరాజ్, డేవిడ్, బుడ్డన్న పాల్గొన్నారు.
‘అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు’ కు
గురుకుల విద్యార్థి
● రేపు జపాన్ వెళ్లనున్న దామరగిద్ద విద్యార్థి శివారెడ్డి
దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయా రు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి స్వగ్రామం మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి. జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయస్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్ఫేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నాడు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని సాయంత్రం జపాన్కు బయలుదేరి వెళ్తాడు.

జిల్లాకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్

జిల్లాకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్