
ఢీలిమిటేషన్..!
మహబూబ్నగర్ డివిజన్ల విభజనలో దుమారం
నూతనంగా ఆవిర్భవించిన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల విభజనపై రాజకీయ దుమారం రాజుకుంది. రహదారులు, రైల్వేలైన్, పెద్ద పెద్ద నాలాల వంటిని హద్దులుగా చేసుకుని.. ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన సేవలందేలా శాసీ్త్రయ పద్ధతిలో చేపట్టాల్సిన డివిజన్ల కూర్పులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులఆరోపణలు, ప్రత్యారోపణలతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. డివిజన్ల విభజన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్
● అశాసీ్త్రయంగా చేశారంటూప్రతిపక్షాల ఫైర్
● పలువురు అధికార పార్టీనాయకుల్లోనూ అసంతృప్తి
● రాజకీయ పక్షాల భిన్నాభిప్రాయాలతో రాజుకున్న వేడి
● డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై 94 అభ్యంతరాలు
● ఈ నెల 16 వరకు కొనసాగనున్న అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

ఢీలిమిటేషన్..!