
టీజీపీఈసెట్
పారదర్శకంగా
ఈవెంట్కు 517మంది హాజరు
పీయూలో సెట్ అభ్యర్థులు ఈవెంట్స్ను కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్బాబు, సెట్ కన్వీనర్ దిలీప్ ఉదయం 7:30గంటలకు సింథటిక్ ట్రాక్లో 100 మీటర్ల పరుగు పందేన్ని గన్ఫైర్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన రెండు క్రికెట్ నెట్లను ప్రారంభించగా.. వీసీ బౌలింగ్ చేస్తే కౌన్సిల్ చైర్మన్ బ్యాటింగ్తో అలరించారు. వీటితోపాటు పీజీ కళాశాల పక్కనున్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పలు కోట్లను పరిశీలించారు. మొదటిరోజు ఈవెంట్స్కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 732మంది మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 517మంది పాల్గొనగా.. 215మంది గైర్హాజరైనట్లు సెట్ కన్వీనర్ దిలీప్ పేర్కొన్నారు. అభ్యర్థులు రన్నింగ్ షార్ట్పుట్, లాంగ్జంప్ అనతతరం 11 క్రీడాంశాల్లో పాల్గొన్నారు.
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తున్న టీజీపీఈసెట్–2025ను పారద్శకంగా నిర్వహిస్తామని టీజీహెచ్ఈసీ (తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్) చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలోని సింథటిక్ ట్రాక్ గ్రౌండ్స్లో సెట్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఈవెంట్స్నుఆయన గన్పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా ఎప్పుడూ పీయూకు రాలేదుని, ఇప్పుడు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాని, పచ్చని చెట్లమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో యూనివర్సిటీ ఉండడం విద్యార్థులకు ఎంతోమేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా పీయూలో అందుబాటులో ఉన్న సింథటిక్ ట్రాక్, గ్రౌండ్స్ ఇతర సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని సెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. తాను పాలమూరుకు చెందిన వ్యక్తిని అయినప్పటికీ జిల్లాల మధ్య తారతమ్యాన్ని చూడనని పేర్కొన్నారు ఉన్నత విద్యామండలి అంటేనే అఫర్డబులిటీ, యాక్ససబిలిటీ, క్వాలిటీ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా మంచి నాణ్యతా ప్రమాణాలను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. దేశానికి నిజమైన ఆస్థి యువతనేనని.. నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించిన వెంటనే ఉద్యోగ అవకాశాలు పొందేవిధంగా కోర్సుల్లో మార్పులు తీసుకొస్తున్నామని, సిలబస్లో కూడా మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.
సెట్ను సమర్థవంతంగా నిర్వహిస్తాం
పాలమూరు యూనివర్సిటీ చరిత్రలో ఒక రాష్ట్రస్థాయి సెట్ నిర్వహణకు మొట్టమొదటిసారి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సెట్ నిర్వహణ బాధ్యతలను తమపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పాలమూరుపై మంచి అభిమానం ఉన్న ఆయన పీయూలో జరిగే సెట్ ఈవెంట్స్కు హాజరుకావడం గొప్ప విషయమన్నారు. ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. గతంలో పనిచేసిన వీసీలు వసతుల కల్పనకు కృషిచేశారని, సింథటిక్ ట్రాక్, గ్రౌండ్ నిర్మించడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ దిలీప్కుమార్, పీయూ రిజిస్ట్రార్ రమేశ్బాబు, మాజీ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, పీడీ శ్రీనివాస్, భూమయ్య, అర్జున్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీజీహెచ్ఈసీ చైర్మన్ బాలకిష్టారెడ్డి
పీయూలో 170ఎకరాల్లో ఆహ్లాదరకమైన వాతావరణం, వసతులు
అందుకే టీజీపీఈసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాం
విద్యార్థులకు అందుబాటులోకి
ఉపాధి అధారిత కోర్సులు
ఉత్సాహంగా ఈవెంట్స్లో పాల్గొన్న అభ్యర్థులు