పరిశ్రమలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలో అగ్ని ప్రమాదం

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

పరిశ్

పరిశ్రమలో అగ్ని ప్రమాదం

జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సెజ్‌ సమీపంలో బుధవారం ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు కర్రలతో కాగితం అట్టలు తయారయ్యే డెక్కన్‌ గోల్డ్‌ ఇండస్ట్రీలో యంత్రాలలో సాంకేతిక సమస్యలు ఏర్పడి షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పరిశ్రమలో ముడిసరుకు అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై పరిశ్రమ నిర్వాహకులు ఎలాంటి వివరాలు వెళ్లడించలేదు.

బావిలో జారిపడి వ్యక్తి మృతి

అమరచింత: ప్రమావశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి పట్టణానికి చెందిన బిందే కురుమన్న(45) మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కురుమన్న జములమ్మ ఆలయం సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. బావిలో నీటిని తీసుకోచ్చేందుకు వెళ్లి కాలుజారి బావిలో పడి మృతిచెందాడు. పొలానికి వెళ్లిన కురుమన్న ఇంటికి రాకపోవడంతో పొలం, బావివద్ద గాలించగా.. బావిలో మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. మృతుడికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పరిశ్రమలో అగ్ని ప్రమాదం 
1
1/1

పరిశ్రమలో అగ్ని ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement