
నేటినుంచి.. అమ్మ మాట– అంగన్వాడీ బాట
మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో ‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం సూచించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలను గ్రామ పంచాయతీ కమ్యూనిటీ సహకారంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సెల్ఫీ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడానికి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమంలో కేంద్రాలను, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. మదర్ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కలిసి ప్రతి గ్రామంలో ర్యాలీలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల సేవలను వివరించాలని చెప్పారు.
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
10న అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించడం, తల్లిదండ్రులు, పిల్లలను స్వాగతించి సెల్ఫీ తీసుకొని ప్రోత్సహించడం, ప్రతి గ్రామ మహిళా సంఘాల సభ్యులు, ఏయే గ్రామ ప్రజలతో ఎన్నుకొనబడిన గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించాలి.
11న సంవత్సరాల పిల్లలను టీచర్లు గుర్తించి, ఆ పిల్లల ఇంటిని సందర్శించడం, తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రంలో అడ్మిషన్స్ గురించి ఫ్రీ స్కూల్, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పిల్లలను నమోదు చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇందులో ఫ్రీ స్కూల్ విద్య అయిపోయిన వారికి సర్టిఫికెట్స్ అందించాలి. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి.
12, 13, 16 తేదీల్లో పోషణ్ పట్టిక, కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయడం, లబ్ధిదారులకు ఆహార పోషకాల గురించి వివరించాలి.
17న పూర్వ ప్రాథమిక విద్య గురించి, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది.
వారంరోజులపాటు
ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ