ఎండీసీఏ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఎండీసీఏ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం

Jun 11 2025 11:41 AM | Updated on Jun 11 2025 11:41 AM

ఎండీసీఏ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం

ఎండీసీఏ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఎండీసీఏ మైదానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హెచ్‌సీఏ జాయింట్‌ సెక్రటరీ బస్వరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో ఇటీవల నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలతో పాటు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బస్వరాజు మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో పెద్ద క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏకు హైదరాబాద్‌ తర్వాత తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో క్రికెట్‌ మైదానాలు ఉన్నట్లు తెలిపారు. మహిళలు క్రికెట్‌లో పాల్గొంటుండడం సంతోషంగా ఉందన్నారు. క్రికెట్‌లో ప్రతిభ కనబరిచే మహిళలకు రైల్వేస్‌ ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు. చదువుతో పాటు క్రికెట్‌ ఆడాలని కోరారు. ఇక్కడి మైదానంలో బీసీసీఐ మహిళ మ్యాచ్‌ పెడుతామని అన్నారు. జిల్లాలో రెండు క్రికెట్‌ అకాడమీలు లేదా 10 ఎకరాల్లో మరో క్రికెట్‌ స్టేడియం ఉండాలన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అపెక్స్‌ సమావేశంలో కూడా చర్చించినట్లు తెలిపారు. ఈ మైదానాన్ని అభివృద్ధి చేయడం తమవంతు బాధ్యత అని అన్నారు. ఈ మైదానంలో బీసీసీఐ, త్రీడే, టూడే లీగ్‌ మ్యాచ్‌లు జరిపిస్తామని అన్నారు. బీపీఎల్‌ కింద ఉన్న వారికి ఉచిత క్రికెట్‌ శిక్షణ అందజేస్తామన్నారు. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జిత్‌సింగ్‌ మాట్లాడుతూ మైదనాంలో అండర్‌–16 మ్యాచ్‌ నిర్వహిస్తామని అన్నారు. క్రికెట్‌లో క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌లు నిర్వహించడం సంతోషంగా ఉందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్‌–23 టూడే లీగ్‌, 19తో పాటు మహబూబ్‌నగర్‌లో ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌లను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిరుపేద క్రీడాకారులను గుర్తించి వారికి ఎండీసీఏ తరపున విద్యతోపాటు క్రికెట్‌లో కోచింగ్‌ అందజేస్తామని చెప్పారు. అనంతరం అండర్‌–23, అండర్‌–19 విభాగాల విన్నర్‌ జట్లు మహబూబ్‌నగర్‌, ఉమెన్స్‌ క్రికెట్‌ లీగ్‌ రెడ్‌ జట్లకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్‌, వెంకటరామారావు, హెచ్‌సీఏ సభ్యులు శంకర్‌, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్‌, సీనియర్‌ క్రీడాకారులు ముఖ్తార్‌, ఆబెద్‌ హుస్సేన్‌, మహేష్‌, రంజిత్‌కుమార్‌, శంకర్‌ పాల్గొన్నారు.

హెచ్‌సీఏ జాయింట్‌ సెక్రటరీ బస్వరాజు

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ లీగ్‌ విన్నర్‌ జట్లకు ట్రోఫీలు ప్రదానం

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ లీగ్‌లో ఉత్తమ ప్రతిభ క్రీడాకారులు

అండర్‌–23 విభాగంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ కేతన్‌కుమార్‌–జడ్చర్ల (473 పరుగులు), ఉత్తమ బౌలర్‌ ముఖితుద్దీన్‌–మహబూబ్‌నగర్‌ (33 వికెట్లు), అండర్‌–19లో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అబ్దుల్‌ రాఫే–మహబూబ్‌నగర్‌ (495 పరుగులు), ఉత్తమ బౌలర్‌ జశ్వంత్‌–నాగర్‌కర్నూల్‌ (11 వికెట్లు), ఉమెన్స్‌ లీగ్‌లో ఉత్తమ బౌలర్‌ దివ్యరాథోడ్‌ (7 వికెట్లు), ఉత్తమ ఆల్‌రౌండర్‌ అనిత (59 పరుగులు, 4 వికెట్లు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement