మహబూబాబాద్ రూరల్ : మందులు కొనుగోలుకు వచ్చిన ఓ వ్యక్తి బైక్ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని రామన్నపేట కాలనీలో నివాసం ఉండే బంధువులు గుగులోత్ వెంకన్న, ఇస్లావత్ వీరన్న (55) మంగళవారం రాత్రి ముందుల కొనుగోలుకు ఓ ఆస్పత్రి వద్దకు వచ్చారు. కొనుగోలు అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు వెనుక నుంచి వీరన్నను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుకాగా వెంటనే స్థానికులు, కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువు వెంకన్న ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనకు బాధ్యుడైన బయ్యారం మండలం కస్తూరి నగర్కు చెందిన బాదావత్ నవీన్పై టౌన్ ఎస్సై బషీరుద్దీన్ కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.
● బైక్ ఢీకొని వ్యక్తి మృతి
● మానుకోటలో ఘటన


