ఎమ్మిగనూరుసెంట్రల్: టీడీపీ నాయకుల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రీచ్లు, వంకల నుంచి ఇసుకను తీసుకవచ్చి దందా సాగిస్తున్నారు. ట్రాక్టర్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఉచితంగా ఇసుక అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ఇసుక కొని ఇళ్లను నిర్మించుకోలేని దుస్థితి సామాన్యులకు ఏర్పడింది. అక్రమ ఇసుక డంపుల వ్యవహారం సంబంధిత అధికారులకు తెలిసినా టీడీపీ నేతల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.


