మల్లన్నను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

Mar 20 2026 8:03 AM | Updated on Mar 20 2026 8:03 AM

మల్లన్నను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దడల ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ బాషణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement