
కావాలనే ఇలా చేశారు
మా పెద్దమ్మాయి లక్ష్మి పదో తరగతి పూర్తి అయ్యింది. రెండో కుమార్తె వసంత ఏడో తరగతి పూర్తి అయ్యి ఇప్పుడు 8వ తరగతిలోకి వెళ్తోంది. మూడో కుమార్తె గంగోత్రి ఐదో తరగతి పూర్తి అయ్యి ఆరో తరగతిలోకి వెళ్తోంది. కుమారుడు విజయ్కుమార్ మూడో తరగతి నుంచి నాలుగో తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు. నాకున్న నలుగురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో డబ్బులు పొందాను. సచివాలయం అధికారులను అడిగితే మెట్ట భూమి పది ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉన్నందున మీరు అనర్హులని చెప్పారు. మాకు 9.40 ఎకరాలు మాత్రమే పొలం ఉంది. ఈ ప్రభుత్వం కావాలనే చేసిందో మరేమో అర్థం కావడం లేదు. – ఉలిగమ్మ,
బిలేహాల్ గ్రామం, హాలహర్వి మండలం