
వ్యవసాయ అధికారుల బదిలీల్లో భారీగా మార్పులు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయాధికారుల బదిలీల్లో పైరవీలు, కూటమి పార్టీల నేతల సిపారసులు, ముడుపుల వ్యవహారం కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ అధికారుల బదిలీల్లో ముడుపులకు తెరలేపడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయమే వ్యవసాయ అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. పనిచేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ అయి కొత్త పోస్టుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు కొత్త స్థానాల్లో చేరిపోయారు. అయితే పలువురు పెద్ద ఎత్తున పైరవీలు చేసి ముడుపులు ముట్టచెప్పడంతో కొద్దిగంటల్లోనే బదిలీల్లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. పరిపాలనా సౌలభ్యం కింద ఒకరిద్దరి స్థానాల్లో మార్పులు జరుగడం సహజం. అలాంటిది 11 మంది వ్యవసాయాధికారుల బదిలీల్లో మార్పులు జరగడం చర్చనీయాంశమవుతోంది. కొత్త పోస్టులో చేరిన కొద్ది గంటల్లోనే మరో పోస్టులో చేరాల్సి రావడం పట్ల వ్యవసాయ అధికారులు భగ్గుమంటున్నారు.
కొత్త పోస్టులో చేరిన కొద్దిగంటల్లోనే మరోచోటుకు బదిలీ