
బడికి చేరని కిట్లు
● సి.బెళగల్ మండలం యనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.38 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టారు. పునాదులు వేసి బేస్మెంట్ లెవెల్ వరకు పనులు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పట్టించుకోకపోవడంతో నిలిచిపోయాయి. దీంతో స్కూల్లో చాలీచాలని గదుల్లో విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది.
కర్నూలు బీ క్యాంపులోని
బాలికల స్కూల్లో టాయ్లెట్ల దుస్థితి
● కర్నూలు నగరంలో బిక్యాంపు బాలురు ఉన్నత పాఠశాలలో సుమారు రూ.5లక్షలకుపైగా ఖర్చూ పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ స్కూల్లో ప్లాంట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఏడాదికిపైగా మూలకు చేరింది. దీంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందిపడక తప్పని పరిస్థితి.
● జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2.69 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది.
● ఇందులో నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్, టెక్ట్స్ బుక్స్ ఇవ్వనున్నారు.
● అయితే నోట్ బుక్స్ 15,35,732, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 28,408, బెల్టులు 1 నుంచి 10 వరకు బాలురు, 1 నుంచి 5 వరకు బాలికలకు 1,90,782 వచ్చాయి.
● 6 నుంచి 10 తరగతుల వరకు చదివే బాలికలకు బెల్టులు రావాల్సి ఉంది.
● వర్క్ బుక్లు 2,37,035కు గాను 2,30,783.. టెక్ట్స్ బుక్లు 9,82,400కు గాను 9,54,382 మాత్రమే వచ్చాయి.
● బూట్లు 2,71,006, పిక్టోరియల్ డిక్షనరీలు (ఫస్ట్ క్లాస్) 20,952, యూనిఫాం 2,69,321 మందికి ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉంది.
● పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు మాత్రమే పునఃప్రారంభం రోజున ఇవ్వనున్నారు.
● మిగిలినవి ఈనెల 16వ తేదీ తర్వాత ఇవ్వనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
నేటి నుంచి పాఠశాలలు
పునఃప్రారంభం
● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు
● అసంపూర్తిగానే
అదనపు తరగతి గదుల నిర్మాణం
● అస్తవ్యస్తంగా మారిన
టాయ్లెట్ల నిర్వహణ
● పాఠశాలలకు అరకొరగానే కిట్లు
● ఇప్పటికీ జిల్లాకు చేరని బూట్లు,
యూనిఫాం, బ్యాగ్లు
● చాలా చోట్ల పనిచేయని ఆర్వో ప్లాంట్లు

బడికి చేరని కిట్లు

బడికి చేరని కిట్లు

బడికి చేరని కిట్లు

బడికి చేరని కిట్లు