
ఆటోల్లో కూర్చొని ఇళ్లముందు మద్యం సేవిస్తున్నారు
కర్నూలు: కర్నూలు బుధవారపేటలో ఇళ్లముందు ఆటోలో కూర్చొని కొంతమంది మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అదే కాలనీకి చెందిన చాముండేశ్వరి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 95 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.