
ఉపాధ్యాయుల వినూత్న నిరసన
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని డీఈఓ కార్యాలయం ఎదుట వినూత్ననంగా మోకాళ్లపై కూర్కొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతారని, మాన్యువల్గా నిర్వహిస్తామని గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ హామీ ఇచ్చారన్నారు. హామీని అమలు చేయాలని కోరితే జీఓలో వెబ్కౌన్సిలింగ్ అని ఇచ్చాం కదా ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం మంచిది కాదన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్కు వాట్సప్లో ఉపాధ్యాయులు సందేశాన్ని పంపించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, పీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వి.కరుణానిధిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్కుమార్, అప్టా సేవలాల్ నాయక్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి తదితరులు పాల్గొన్నారు.