
విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయ’ం
● 6వ తరగతిలో ప్రవేశానికి
దరఖాస్తుల ఆహ్వానం
● వచ్చే నెల 29వ తేదీ వరకు గడువు
● కర్నూలు, నంద్యాల జిల్లాల
విద్యార్థులకు అవకాశం
దరఖాస్తు ప్రారంభ తేదీ
02-06-2025
దరఖాస్తులకు ఆఖరు తేదీ
29-07-2025
పరీక్ష తేదీ 13-12-2025
సంప్రదించాల్సిన ఫోన్ నంబరు
08512-246544
ఎమ్మిగనూరురూరల్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. ఉత్తమ విద్యా బోధన అందిస్తూ ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం పేరుగాంచింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని స్థాపించారు. ఈ విద్యాలయంలో సీటు వచ్చిందంటే చాలు తమ బిడ్డ భవిత బంగారమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ప్రకటన విడుదలైంది. జూలై 29వ తేదీ వరకు అన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. బనవాసి జవహార్ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు అందుబాటులో ఉండగా బాలికలకు 30 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు.
ప్రత్యేకతలు ఇవే..
● సీబీఎస్ఈతో కూడిన అత్యుత్తమ విద్యా బోధన
● అధునాత కంప్యూటర్ ల్యాబ్
● పోషక విలువలతో కూడిన ఆహారం
● మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్సీసీ తదితర అంశాలు
● విశాలమైన గ్రంథాలయం.
అత్యుత్తమ విద్యాప్రమాణాలు
విద్యాలయంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అమలు చేస్తున్నాం. విద్యార్థుల సర్వోతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మానసిక నిపుణలతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. కేరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. న్యూట్రీషియన్ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో చాలమంది ఉన్నారు.
– ఇ.పద్మావతి, ప్రిన్సిపాల్, బనవాసి నవోదయ

విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయ’ం