
పెద్దమ్మ దేవరలో విషాదం
● విద్యుదాఘాతంతో మహిళ మృతి
దొర్నిపాడు: డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ దేవరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు...దొర్నిపాడుకు చెందిన బోయ బాల ఉసేని భార్య ఉష మూల పెద్దమ్మ దర్శనం కోసం డబ్ల్యూ గోవిందిన్నెకు సోమవారం తెల్లవారుజామున చేరుకుంది. దర్శనం కోసం వెళ్తుండగా క్యూలైన్ల వద్ద స్తంభాన్ని తాకడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆమె పక్కన మరో ముగ్గురు మహిళలు కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోవెలకుంట్ల వైద్యశాలకు తరలించగా అప్పటికే ఉష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
బొమ్మలసత్రం: పాణ్యం పోలీస్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సోమవారం స్థానిక సీసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు చెందిన కట్టా శివశంకర్, రాజమహేంద్రవరం జిల్లాకు చెందిన వెంకటేశ్వరావును గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో 40కి పైగా చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. వారి నుంచి పావు కేజీ బంగారు ఆభరణాలు, కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. దొంగల అరెస్ట్లో ప్రతిభ చూపిన సీఐలు సురేష్కుమార్, కిరణ్కుమార్రెడ్డి సిబ్బందిని అభినందించారు.

పెద్దమ్మ దేవరలో విషాదం