శ్రీమఠంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో భక్తుల రద్దీ

Jun 8 2025 1:01 AM | Updated on Jun 9 2025 8:48 AM

శ్రీమఠంలో భక్తుల రద్దీ

శ్రీమఠంలో భక్తుల రద్దీ

మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల సందడితో రాఘవేంద్ర స్వామి మఠం కారిడార్‌ కళకళలాడింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకున్నారు.

అంతంతమాత్రం తేమలో విత్తనం వేయొద్దు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అంతంతమాత్రం తేమలో విత్తనం విత్తుకోవద్దని ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌, ప్రధాన శాస్త్రవేత్త సుజాతమ్మ తెలిపారు. నల్లరేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం ఒక్క రోజులో నమోదైనా లేదా వరుసగా మూడు రోజుల్లో నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవాలని సూచించారు. ఎర్ర నేలల్లో కనీసం మూడు రోజులు లేదా ఒక్కరోజులో 50 మి.మీ వర్షపాతం నమోదైతేనే విత్తనం వేసుకోవాలన్నారు. అంతంతమాత్రం తేమలో విత్తనం వేసుకుంటే మొలక సరిగా రాద ని పేర్కొన్నారు. ప్రస్తుతం పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేందుకు ఇది చక్కటి అదును అన్నారు. వరిలో జనుము, జీలుగ, పిల్లి పెసర వేసుకోవచ్చని, మెట్ట పంటల్లో పిల్లిపెసర వేసుకోవచ్చని వివరించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

శ్రీమఠం అన్నదానానికి రూ.లక్ష విరాళం

మంత్రాలయం రూరల్‌: శ్రీరాఘవేంద్ర మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి కడపకు చెందిన రామకృష్ణయ్య అనే భక్తుడు రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. విరాళం అందజేసిన భక్తుడిని శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆశీర్వదించారు.

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజనల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులను స్వీరిస్తారన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అదేవిధంగా అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అండర్‌ వాటర్‌ వీడియోగ్రఫీకి సిద్ధం

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్‌లో అండర్‌ వాటర్‌ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ సోమవారం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం నుంచి ప్లంజ్‌పూల్‌ నీటిలో పరిశోధన జరిపే పరికరాలను సిద్ధం చేస్తున్నారు. వాల్తేరు నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు శ్రీశైలండ్యాం వద్ద పరికర సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిపుణులు సోమవారం నుంచి ప్లంజ్‌పూల్‌లో ఏర్పడిన గోతులను, కాంక్రీట్‌ సిలండర్ల పటిష్టతను చిత్రీకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement