మొక్కలు నాటి సంరక్షించండి | - | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటి సంరక్షించండి

Jun 6 2025 1:10 AM | Updated on Jun 6 2025 1:10 AM

మొక్కలు నాటి సంరక్షించండి

మొక్కలు నాటి సంరక్షించండి

వెల్దుర్తి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మైనింగ్‌ శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ) రవిచంద్‌ సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన రాయలసీమ జోన్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ ఏడీ వెంకటేశ్వర్లుతో కలిసి మండల పరిధిలోని బోయనపల్లె కాంతారెడ్డి ఇరన్‌ ఓర్‌ మైన్‌లో 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ భూమిపై ప్రతి జీవి మనుగడకు చెట్లు ఆధారమన్నారు. ప్రకృతిలో భాగమైన చెట్ల ద్వారానే మనిషికి శ్వాస, ఆహారం, ఆరోగ్యం, ఆనందం దొరుకుతుందన్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement