
మత్తు పదార్థాలను అరికట్టాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో మత్తు పదార్థాల సాగు, రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశంలో గంజాయిసాగు, రవాణా, నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకంపై జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్తో కలిసి అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సహరించాలన్నారు. హెల్త్, ఎకై ్సజ్, మునిసిపల్ శాఖలు తమ ప్రతి కార్యక్రమంలో ఈ అంశాన్ని ఎజెండగా చేర్చుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో డ్రగ్స్ వినియోగించినా, గంజాయి సాగు చేసినా సంబంధిత వీఆర్వోతోపాటు సర్పంచ్లపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందని, అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహరించాలన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ముద్రించిన పోస్టర్లను సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. జనరల్హాస్పిటల్లో ఉన్న డిఅడిక్షన్ సెంటర్కు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిఅడిక్షన్ సెంటర్లో టెస్టింగ్ కిట్స్ లేకపోతే వాటిని కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ తీసుకోవడంతో కలిగే దుష్పరిమాణాలను గోడల మీద రాయించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పంట సీజన్ మొదలవడంతో గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి విద్యా సంస్థలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 7 ఎన్డీపీపీఎస్ కేసులను గుర్తించామన్నారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర రవీంద్రబాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా

మత్తు పదార్థాలను అరికట్టాలి