క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

Jun 6 2025 1:10 AM | Updated on Jun 6 2025 1:10 AM

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

కోడుమూరు రూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.3,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఇన్‌చార్జ్‌ సీఐ మన్సురుద్దీన్‌ విలేకరులకు వెల్లడించారు. కోడుమూరుకు చెందిన గుజరాతి వినోద్‌కుమార్‌, మాదిగుండు వేణుగోపాల్‌, కోసూరు సోమశేఖర్‌, పలవారి భాస్కర్‌రెడ్డి ఈనెల 3న జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను టీవీలో చూస్తూ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతుండగా ఎస్‌ఐ ఎర్రిస్వామి తన సిబ్బందితో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తేలడంతో బెట్టింగ్‌లో పెట్టిన రూ.3,40,000 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసినట్లు సీఐ వివరించారు. బెట్టింగ్‌ రాయుళ్లను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ ఎర్రిస్వామి, ఏఎస్‌ఐ శంకర్‌నాయక్‌, హెడ్‌కానిస్టేబుళ్లు మద్దేశ్వర్‌, మహబూబ్‌బాషా, మురారి, కానిస్టేబుళ్లు జగదీష్‌, విజయకుమార్‌, భాస్కర్‌, ఓంకార్‌లను సీఐ అభినందించారు.

రూ.3,40,000 నగదు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement