పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

Jun 6 2025 1:09 AM | Updated on Jun 6 2025 1:09 AM

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

కర్నూలు కల్చరల్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పిలుపునిచ్చారు. గురువారం నగర శివారులోని నగర వనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, జిల్లా అటవీ శాఖ అధికారిణి పి.శ్యామల నగర వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ‘ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడం’ అనే థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ తరాలకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఙ చేశారు. నగర వనంలో చిల్డ్రన్స్‌ పార్క్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్‌డీవో సందీప్‌, అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌వో రవిశంకర్‌, నగర పాలక సంస్థ కమీషనర్‌ రవీంద్రబాబు, జిల్లా పరిషత్‌ సీఈవో నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement