ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్‌! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్‌!

Jun 3 2025 5:37 AM | Updated on Jun 3 2025 5:37 AM

ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్‌!

ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్‌!

పార్టీకి, పార్టీ సభ్యత్వానికి

రాజీనామా చేసిన 21వ వార్డు కౌన్సిలర్‌

త్వరలో కౌన్సిలర్‌ బాటలో మరికొందరు

ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణంలో కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్‌ తగిలింది. తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్వత్వానికి 21వ వార్డు కౌన్సిలర్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వీజీఏ. వాల్మీకి దయసాగర్‌ సోమవారం రాజీనామా చేయటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 11 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చురుకై న కార్యకర్తగా అనేక బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎర్పడి సంవత్సరం కావస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో సొంత పార్టీ నేత, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజీనామా కూటమి ప్రభుత్వానికి కోలుకోలేని షాక్‌ ఇచ్చినట్లయింది. కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, అయినా అధికార పార్టీకి రాజీనామా చేయటం గమనార్హం. కౌన్సిలర్‌ బాటలోనే మరికొందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement