ఉద్యోగాల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం

Jun 3 2025 5:35 AM | Updated on Jun 3 2025 5:35 AM

ఉద్యోగాల పేరుతో మోసం

ఉద్యోగాల పేరుతో మోసం

పీజీఆర్‌ఎస్‌కు 83 ఫిర్యాదులు

కర్నూలు: ఇంటర్‌ చదివిన మా అమ్మాయి, అబ్బాయికి కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫరూక్‌ అనే వ్యక్తి రూ.2.26 లక్షలు తీసుకుని మోసగించాడని కర్నూలు అరుంధతి నగర్‌కు చెందిన డి.ఉమాబాయి ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 83 ఫిర్యాదులు రాగా, చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తగు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement