
బాబుది వెన్నుపోటు చరిత్ర
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వెన్నుపోటు చరిత్రను ఎవరు మరచిపోగలరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై ఈనెల 4న చేపడుతున్న వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కర్నూలు గిప్సన్ కాలనీలోని తన నివాసంలో కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. నగర మేయర్ బీవై రామయ్య, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయమనోహారి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో మంత్రి పదవి అనుభవించి ఆ పార్టీకే వెన్నుపొడిచారన్నారు. తరువాత మామ వంచన చేరి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన విషయం ఎవరూ మరచిపోలేరనప్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు ఇస్తామని ఎన్నికల్లో సమయంలో హామీ ఇచిక్చ అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.
● కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నైజం అబద్ధాలు చెప్పడమేనన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక మరచిపోయారన్నారు. అమరావతి తప్ప ఇతర ఏ జిల్లాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.
● కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయమనోహరి మాట్లాడుతూ.. మహిళలను, నిరుద్యోగులను, రైతులను టీడీపీ మోసం చేసిందన్నారు. కర్నూలు ఆర్ఎస్ రోడ్డులో దేవాలయం ఎదురుగా టానిక్ అనే మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు.
● వెన్నుపోటు దినం పోస్టర్లను వైఎస్సార్సీపీ నేతలు అవిష్కరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, పార్టీ నాయకురాలు మంగమ్మ, భారతి, కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, జుబేర్, రాజేశ్వర రెడ్డి, ఆర్షియా ఫర్హీన్, షేక్ అహమ్మద్, యూనుసుభాషా తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చేంత వరకు
ప్రభుత్వంపై పోరాటం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్రెడ్డి, మేయర్ రామయ్య

బాబుది వెన్నుపోటు చరిత్ర