మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పి.రేణుక ఉమెన్ క్యాటగిరీలో 4.5 పాయింట్లు సాధించి బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డుతో పాటు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా చెప్పారు. స్థానిక చుట్టుగుంటలోని ఎస్ఆర్ఆర్ చెస్ అకాడమీ ఆవరణలో పతకాలు పొందిన క్రీడాకారులను సోమవారం ఆయన అభినందించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలికల అండర్ –7 కేటగిరిలో గోలి అతిథి శ్రేయ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుందన్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులతో పాటుగా చెస్ క్రీడాకారులు పాల్గొని పతకాలు పొందిన రేణుక, గోలి అతిథి శ్రేయలను అభినందించారు.


