ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలు
పమిడిముక్కల: హనుమంతపురం– కనుమూరు రహదారిపై ముళ్లపూడి ములుపు వద్ద గురువారం జరిగిన ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, దాసరిపాలెం గ్రామానికి చెందిన 12 మంది కూలీలు ఆటోలో పమిడిముక్కల మండలం ముళ్లపూడి గ్రామంలో వరికోతలకు వెళుతున్నారు. ముళ్లపూడి వద్ద ఆటో ప్రమాదవశాత్తూ పక్కకు ఒరిగిపోవడంతో ఆటోలోని 9 మందికి గాయాలయ్యాయి. అంబులెన్స్లో ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురికి స్వల్ప గాయాలవడంతో చికిత్స చేయించుకొని స్వగ్రామం వెళ్లిపోయారు. ఇరువురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు.


