గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

Nov 14 2025 8:57 AM | Updated on Nov 14 2025 8:57 AM

గుంటూరు డివిజన్‌  మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థాం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్‌ పీఆర్‌ఓ వినయ్‌కాంత్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌(07619) వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఈనెల 16వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఎస్‌ఎంవీటి బెంగళూరు–భాగల్‌పూర్‌(06565) రైలు విజయవాడ డివిజన్‌ మీదుగా ఈనెల 15వ తేదీన కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు కృష్ణరాజపూరం, కాట్‌పడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, పలాస, భరంపూర్‌, కూర్ద్‌ రోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భదర్కా, ఖరగ్‌పూర్‌, అన్‌దూల, భట్టానగర్‌, రామ్‌పూర్‌ హట్‌, బారహరవా, షిబన్‌జీ స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement