శంకుస్థాపనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి డుమ్మా | - | Sakshi
Sakshi News home page

శంకుస్థాపనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి డుమ్మా

Nov 12 2025 5:49 AM | Updated on Nov 12 2025 5:49 AM

శంకుస్థాపనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి డుమ్మా

శంకుస్థాపనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి డుమ్మా

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఇంటికో పారిశ్రామిక వేత్త’ నినాదంతో మైలవరం మండలం, చండ్రగూడెం గ్రామంలో ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్‌గా హాజరై శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇటీవల వీటీపీఎస్‌ బూడిద రవాణాపై తన పెత్తనం చెల్లకపోవడంపై నియోజకవర్గ ప్రజాప్రతినిధి రగిలిపోతున్నట్లు తెలిసింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రభుత్వంపై అసమ్మతి రాగం అందుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తన నిరసన గళం వినిపించేందుకే శంకుస్థాపనకు హాజరు కాలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధి హాజరు కాకపోవ డంతో ఆ తంతును విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, తహసీల్దార్‌ అబ్దుల్‌దరియా, ఎంపీడీఓ అనూరాధ పూర్తి చేశారు.

వీటీపీఎస్‌ బూడిద అంశంలో తన మాట చెల్లుబాటు కాలేదని అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement