కేడీీసీసీ బ్యాంక్‌తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం | - | Sakshi
Sakshi News home page

కేడీీసీసీ బ్యాంక్‌తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

Oct 11 2025 9:28 AM | Updated on Oct 11 2025 9:28 AM

కేడీీసీసీ బ్యాంక్‌తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

కేడీీసీసీ బ్యాంక్‌తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

జగ్గయ్యపేట అర్బన్‌: కేడీసీసీ బ్యాంక్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ నెట్టెం రఘురామ్‌ అన్నారు. కేడీసీసీ బ్యాంక్‌ జగ్గయ్యపేట బ్రాంచ్‌ పరిధిలోని సొసైటీలు, బ్యాంకు సిబ్బంది, ఇన్‌చార్జ్‌లతో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ నెట్టెం రఘురామ్‌ సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం బ్యాంక్‌ బ్రాంచ్‌ టార్గెట్‌ రూ 361 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.310 కోట్లు సాధించామని చెప్పారు. రైతు, సహకార సంఘం, ఎంఎస్‌ఎంఈ రంగాల సమగ్ర అభివృద్ధే బ్యాంక్‌ ప్రధాన లక్ష్యం అన్నారు. రైతు సౌభాగ్యమే బ్యాంకు విజయానికి ఆధారం అని స్పష్టం చేశారు. మల్కాపురం సొసైటీ కార్యాలయం నిర్మించేందుకు ఇంజినీరింగ్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే ఎంఎస్‌ఎంఈ చిన్న వ్యాపారాలకు పెద్ద తోడుగా ఉందని, పీఎం సూర్యఘర్‌ పథకం ద్వారా విద్యుత్‌ ఆదాతో పాటు ఆర్థికంగా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్‌ టెక్నాలజీతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. అనంతరం ఆయన గోపాలకృష్ణ లార్జ్‌ సైజ్‌ కోపరేటివ్‌ సొసైటీ, కృష్ణాఫార్మర్స్‌ సొసైటీలను సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. కృష్ణా ఫార్మర్స్‌ సొసైటీ పరిధిలో నడుస్తున్న జన ఔషది మెడికల్‌ స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య), గౌరవరం సొసైటీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు, గోపాలకృష్ణ, కృష్ణా ఫార్మర్స్‌ సొసైటీల అధ్యక్షులు దూళిపాళ్ల లక్ష్మణరావు, యానాల గోపి, బండిపాలెం, మల్కాపురం సొసైటీల అధ్యక్షులు అప్పారావు, పిచ్చయ్యచౌదరి, నందిగామ బ్రాంచ్‌ ఏజీఎం శ్రీదేవి, పేట బ్రాంచ్‌ ఛీప్‌ మేనేజర్‌ రమేష్‌, బ్యాంక్‌ సిబ్బంది, సొసౌటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ రఘురామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement