లెక్కల పరీక్షకు 343 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

లెక్కల పరీక్షకు 343 మంది గైర్హాజరు

Mar 25 2025 2:22 AM | Updated on Mar 25 2025 2:18 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి సోమవారం జరిగిన మ్యాథ్స్‌ పేపరుకు 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 168 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 28,122 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 27,779 మంది హాజరయ్యారు. హాజరు 98.78 శాతంగా అధికారులు ప్రకటించారు. పాఠశాల విద్యా జోన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి. నాగమణి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గవర్నరుపేట, సత్యనారాయణపురం, జక్కంపూడి, గాంధీనగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు ఎనిమిది పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఫ్లయింగ్‌ స్క్వాడ్లు 114 కేంద్రాలను తనిఖీ చేశాయి.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు స్వాధీనం

జగ్గయ్యపేట: తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి. వెంకటేశ్వర్లు సోమవారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ముక్త్యాల గ్రామానికి రాత్రి గస్తీ నిమిత్తం సీఐ వెళ్లారు. అక్కడ చెక్‌ పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇసుక లారీలు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేశారు. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలుతున్నట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి లారీలను చిల్లకల్లు స్టేషన్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు.

లెక్కల పరీక్షకు  343 మంది గైర్హాజరు 
1
1/1

లెక్కల పరీక్షకు 343 మంది గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement