ఆసిఫాబాద్అర్బన్: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సమ్మెబాట పట్టా రు. జిల్లా కేంద్రంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహానికి మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మి కుల యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి మా ట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయకులు చాపిడి బాలేష్, పురుషోత్తం, వెంకటేశ్, వేణు, కుమార్, పల్లె కుమార్ తదితరులు పాల్గొన్నారు.


