ఖమ్మం సహకారనగర్ : ప్రజావాణిలో పలు సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మశ్రీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటారని, వారి సమస్యలపై స్పందించాలని సంబంధిత శాఖల అదికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..
● తల్లాడ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కె. కిరణ్కుమార్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనంలోకి మార్చాలని విన్నవించారు.
● ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న ఈద్గాకు మరమ్మతులు చేయాలని, గోడ నిర్మించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు వినతిపత్రం అందించారు.
● వైరా మండలం కోష్టాల గ్రామ సర్పంచ్ ఇష్టానుసారంగా నర్సరీ మొక్కలు పెంచుతున్నారని, తద్వారా గ్రామానికి నష్టం జరుగుతోందని, దీనిపై చర్యలు చేపట్టాలని వార్డు సభ్యుడు వి. సాంబయ్య కోరారు.
ప్రజావాణిలో డీఆర్ఓ పద్మశ్రీ


