ఖమ్మంక్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేయనున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ అన్నారు. ఇందులో భాగంగా కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఉదయం 8–30నుండి మధ్యాహ్నం 1–30గంటల వరకు ఐదుగురికి మించి గుంపుగా ఉండొద్దని సూచించారు. ఆ మార్గంలో సభలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి ఉండదని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని తెలిపారు. అంతేకాక కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతుందని సీపీ వెల్లడించారు.


