శికారిపురలో చిరుతల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

శికారిపురలో చిరుతల హల్‌చల్‌

Mar 23 2026 8:52 AM | Updated on Mar 23 2026 8:52 AM

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలోని తడసనహళ్లి, అడగంటి, ముత్తగి గ్రామాల్లో శనివారం ఒక్కరోజే ముగ్గురిపై చిరుతపులి దాడి చేయగా, వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

● అడగంటి గ్రామానికి చెందిన సుదీప్‌ సాయంత్రం ముత్తగి గ్రామం సమీపంలోని మొక్కజొన్న పొలానికి వెళ్లగా చిరుత అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను శివమొగ్గలోని మెగ్గన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

● శనివారం ఉదయం తన వరి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన తడసనహళ్లి గ్రామ రైతు ముత్తన్నపై చిరుత దాడి చేసింది. కొరికి, గోళ్లతో రక్కడంతో తీవ్రంగా గాయపడిన అతడిని కూడా తదుపరి చికిత్స కోసం మెగ్గన్‌ ఆసుపత్రిలో చేర్చారు.

● సాయంత్రం, తడసనహళ్లి, అడగంటి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తున్న హూవ్య నాయకపై కూడా చిరుత దాడి చేయగా, స్వల్ప గాయాలు అయ్యాయి.

బోనులు ఏర్పాటు

దాడులతో మేలుకున్న అటవీ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి తాడసనహళ్లిలో పొలాలు, తోటల్లో 3 చోట్ల బోనులను ఏర్పాటు చేశారు. చిరుతలు అరుదుగా మనుషులపై దాడి చేస్తాయి, దానికి ఏదైనా వ్యాధి సోకి ఉండవచ్చు లేదా ఆందోళనకు గురై మనుషులపై దాడి చేసి ఉండవచ్చు అని జోనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ జావిద్‌ అంగడి చెప్పారు. అయితే రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.

వేర్వేరుచోట్ల ముగ్గురిపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement