ఘనంగా జయంత్యుత్సవ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జయంత్యుత్సవ వేడుకలు

Nov 11 2025 5:49 AM | Updated on Nov 11 2025 5:49 AM

ఘనంగా

ఘనంగా జయంత్యుత్సవ వేడుకలు

హొసపేటె: నగరంలోని అమరావతిలోని వడకరాయ స్వామి ఆలయంలో యాజ్ఞవల్క సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 40వ శివచిదంబర గురు జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో గురువు చిత్రపటాన్ని ప్రతిష్టించారు. అప్పుడు, కాకడహారతి, రుద్రాభిషేకం, గురు జనోత్సవ ఊయల సేవ నిర్వహించారు. మంత్రాలయ దాస సాహిత్య ప్రాజెక్టు జిల్లా కోఆర్టినేటర్‌ అనంత పద్మనాభం ట్రస్టు నాయకులను దాసరయ్య శేషవస్త్రంతో సత్కరించారు. మహిళలు భజనలు, సామూహిక కీర్తనలు పాడారు. చిదంబర వ్రతం, కథా శ్రవణంతో పాటు పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ట్రస్టు నాయకులు రామారావు, వాసుదేవ ఆచార్య, రాఘవేంద్రరావు, మాలతేష్‌ రావు, హెచ్‌.గురురాజ్‌ కులకర్ణి, సంపద గురురాజ్‌, అనిల్‌ జోషి, గిరీష్‌ దీక్షిత్‌, పాండురంగరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జయంత్యుత్సవ వేడుకలు 1
1/1

ఘనంగా జయంత్యుత్సవ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement