అట్టహాసంగా ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఊరేగింపు

Nov 9 2025 7:19 AM | Updated on Nov 9 2025 7:19 AM

అట్టహ

అట్టహాసంగా ఊరేగింపు

హొసపేటె: పట్టణంలోని వినాయక హైస్కూల్‌ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల ప్రారంభానికి ముందు శుక్రవారం సాయంత్రం ఊరేగింపు ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి 1400 మంది పోటీదార్లు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారు. ఎమ్మెల్యే నేమిరాజ్‌ నాయక్‌తో పాటు పట్టణ పంచాయతీ సభ్యులు, అధికారులు జానపద కళా మేళాలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ జానపద బృందాలు పట్టణ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపునకు ఉత్సాహానిచ్చాయి. దాదాపు 3–4 గంటల పాటు జరిగిన సుదీర్ఘ ఊరేగింపును చూడటానికి ప్రజలు గుంపులుగా గుమిగూడారు.

జానపద కళా బృందాలు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆకర్షణీయంగా అలంకరించిన వాహనంలో ఎమ్మెల్యే నేమిరాజ్‌ నాయక్‌ వెంట శోభాయాత్రలో ఏకలవ్య అవార్డు గ్రహీత స్థితి పాటిల్‌, కర్ణాటక కేసరి స్వాతి పటేల్‌, నేషనల్‌ ఛాంపియన్‌ రఫీక్‌ మౌలా సాబ్‌ షేక్‌, మైసూరు బాల్‌ కంఠీరవ హనుమంత విఠల్‌ పటేల్‌, మహేష్‌కుమార్‌ లంగోటితో పాటు వందలాది మంది మల్లయోధులు ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాని వీధి నుంచి స్టేడియం వరకు దీపాలు ఆకట్టుకున్నాయి.

అట్టహాసంగా ఊరేగింపు 1
1/1

అట్టహాసంగా ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement