మైసూరు ఉత్సవాలకు రారండి | - | Sakshi
Sakshi News home page

మైసూరు ఉత్సవాలకు రారండి

Sep 5 2025 8:10 AM | Updated on Sep 5 2025 8:10 AM

మైసూరు ఉత్సవాలకు రారండి

మైసూరు ఉత్సవాలకు రారండి

మైసూరు: మైసూరు దసరా మహోత్సవాలు ప్రారంభం కావడానికి ముందుగా జరిగే యువ సంభ్రమ వేడుకలు సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మైసూరు మానస గంగోత్రిలోని బయలు రంగమందిరంలో జరుగుతాయి. యువత కోసం జరిగే ఈ ఉత్సవాలలో కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేయబోతున్నాయి. కన్నడ చిత్ర నటుడు అయిన యువ రాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని నాంది పలుకుతారు. 8 రోజులపాటు సంబరాల సందడి అంబరాన్ని దాటనుంది. ఈసారి 14 థీమ్స్‌లో భాగంగా వివిధ కాలేజీలకు చెందిన 400 నుంచి 500 బృందాలు నృత్య కళా ప్రదర్శనలతో అలరిస్తాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యువ సంభ్రమ సందడి కొనసాగుతుంది. మంత్రి మహాదేవయ్య, జిల్లాధికారి, ఇతర అధికారులు గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకుని సీఎం సిద్దరామయ్యకు మైసూరు దసరా ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement