
బెంగళూరులో బాలింత..
యశవంతపుర: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రసవమైన గంటలో బాలింత మరణించిన ఘటన బెంగళూరులో జరిగింది. బాలింత మృతికి వైద్యుల అలసత్వం కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని కోణనకుంట క్రాస్లోని అస్ట్రాం ఆస్పత్రిలో మంగళవారం మండ్యకు చెందిన తను (23) అనే గర్భిణి ప్రసవం కోసం చేరింది. వైద్యులు తనుకు సిజేరియన్ కాన్పు చేశారు. గంట తరువాత తను పరిస్థితి విషమించి కన్నుమూసింది. పుట్టిన గంటకే శిశువు అనాథ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు.