నాటక, సంగీత బృందాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

నాటక, సంగీత బృందాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 8 2025 6:55 AM | Updated on Jul 8 2025 6:55 AM

నాటక, సంగీత బృందాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

నాటక, సంగీత బృందాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

హొసపేటె: వీధి నాటకాలు, జానపద సంగీత బృందాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి కళా బృందాలను ఎంచుకోవడానికి సమాచార, ప్రజా సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. వీధి నాటకం, జానపద సంగీత కార్యక్రమాల నిర్వహణను సులభతరం చేయడానికి ప్రతి జిల్లా నుంచి 3 వీధి నాటకాలు, 3 జానపద సంగీత కళా బృందాలను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే బృందాలు రిజిస్టర్డ్‌ సంస్థలై ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రతి వీధి నాటక బృందంలో 8 మంది కళాకారులు ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉండాలి. ఒకరు షెడ్యూల్డ్‌ కులం లేదా షెడ్యూల్డ్‌ తెగకు చెందిన కళాకారిణి అయి ఉండాలి. ప్రతి జానపద సంగీత కళా బృందంలో ముగ్గురు కళాకారులు ఉంటారు. వారిలో ఒకరు మహిళ అయి ఉండాలి. ఒకరు షెడ్యూల్డ్‌ కులం లేదా షెడ్యూల్డ్‌ తెగకు చెందిన కళాకారిణి అయి ఉండాలి. కళా బృందాలను ఎంపిక చేయడానికి జిల్లా స్థాయిలో కన్నడ, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ, షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 2025 ఆగస్టు 12న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ ఏకకాలంలో జరుగుతుంది. అనుభవానికి 10 మార్కులు, కళాత్మక వ్యక్తీకరణకు 10 మార్కులు, సృజనాత్మకత ప్రదర్శనకు 10 మార్కులు ఇవ్వడం ద్వారా కళా బృందాలను ఎంపిక చేస్తారు. జిల్లాలోని అర్హత కలిగిన కళా బృందాలు విజయనగరలోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి నిర్దేశిత దరఖాస్తు ఫాంను పొంది, దానిని నింపి 2025 ఆగస్టు 5లోపు సమర్పించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ సీనియర్‌ ఏడీ ధనుంజయప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement