
దొడ్డబళ్లాపురం: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మద్యం మత్తులో హల్చల్ చేశారు. ఈఘటన మాగడి పట్టణంలో జరిగింది. ఏఎస్ఐ మంజునాథ్, కుదూరు క్రైం పీసీ నారాయణ, మరో ఇద్దరు పోలీసులు మాగడి పోలీస్స్టేషన్ నుంచి ఓ ఖైదీని తీసుకుని రామనగర జిల్లా కారాగృహం వెళ్లారు.
ఖైదీని అక్కడ వదిలి తిరిగి వస్తూ మార్గం మధ్యలో మద్యం తాగారు. షర్టులు విప్పి కారు డ్రైవర్తో గొడవపడ్డారు. ఇదేమని ప్రశ్నించిన స్థానికులను దుర్భాషలాడారు. స్థానికులు ఈదృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.