కరీంనగర్ రాంనగర్లో చాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం రోబోటిక్ మూషిక ప్రదర్శన ఆకట్టుకుంది. స్వామివారికి కాశి గంగాహారతి తరహాలో ప్రత్యేక హారతి సమర్పించారు. సీపీ గౌస్ఆలం ఈ ప్రదర్శనను ప్రారంభించగా, చిన్నారులు, యువత రోబోటిక్ మూషికంతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. ‘డోబో రోబోటిక్స్’ రూపొందించిన వినూత్న వాహనం భక్తులకు సరికొత్త అనుభూతి అందించిందని నిర్వాహకుడు తుమ్మల రేవంత్రెడ్డి, కార్పొరేటర్ గాజ రమా తెలిపారు. సీపీతో పాటు ఏసీపీలు ప్రదర్శనను తిలకించారు.
– కరీంనగర్కల్చరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


