శవమై కనిపించిన సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి | - | Sakshi
Sakshi News home page

శవమై కనిపించిన సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

శంకరపట్నం: ఇంటి నుంచి వెళ్లిన సింగరేణీ రిటైర్డ్‌ ఉద్యోగి మాతంగి కొంరయ్య(75) మండలంలోని కాచాపూర్‌ గ్రామశివారులో శవమై కనిపించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొంరయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయ్యాడు. కుటుంబంతో కలిసి అత్తగారి ఊరు ముత్తారంలో నివాసం ఉంటున్నాడు. కొంరయ్య పెద్ద కుమారుడు ఆనంద్‌ ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో అదే బెంగతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం గొర్రెల కాపరులకు కాచాపూర్‌ శివారులో శవమై కనిపించాడు. కొడుకుపై బెంగతోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement