మీదే పురతర బాధ్యత!
న్యూస్రీల్
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● ఉమ్మడి జిల్లాలోని బల్దియాల్లో స్వాగతం పలుకుతున్న సమస్యలు ● ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న స్థానికులు
● పరిష్కారానికి నగర, పట్టణ ప్రజల ఎదురుచూపులు ● నూతన పాలకవర్గంపై కొండంత ఆశలు
కరీంనగరంలోని మానేరువాగు ఒడ్డున 9వ డివిజన్ పరిధిలో ఉన్న డంప్యార్డ్ ప్రధాన సమస్యగా మారింది. ఈ డంప్యార్డ్కు నగరం నుంచి ప్రతి రోజు దాదాపు 160 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతోంది. బయోమైనింగ్ విఫలం కావడంతో మూడున్నర లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. డంప్యార్డ్లో నిత్యం నిప్పు పుట్టడంతో ఆ పొగ వ్యాపించి, ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలను తెస్తోంది. 20 డివిజన్ల ప్రజలు డంప్యార్డుతో ఇబ్బంది పడుతున్నారు.
పట్టణాలు, నగరాలుగా మారుతున్నా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మట్టిరోడ్లు. ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పూర్తికాని డ్రైనేజీలు.. కంపుకొడుతున్న ఖాళీ ప్రదేశాలు.. రహదారులపై పారుతున్న మురుగునీరు.. వెంబడిస్తున్న కుక్కలు.. ఇళ్లలోకి చేరి రచ్చ చేస్తున్న కోతులు.. రోగాలు తెచ్చిపెడుతున్న డంపింగ్ యార్డులు.. ఇలా వందలాది సమస్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగరాలు, పట్టణాల ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. పరిష్కరించాల్సిన పాలకులు ఇన్నాళ్లూ పట్టించుకోకపోగా.. నూతన పాలకవర్గాలు, మేయర్లు, చైర్మన్లపైనే ఆయా ప్రాంతాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
– వివరాలు IIలోu
మీదే పురతర బాధ్యత!
మీదే పురతర బాధ్యత!


