కొత్త బ్యాంకు ఖాతాలివ్వాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్
కరీంనగర్రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాలను ఇవ్వాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలం నగునూరు క్లస్టర్కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రకియను పరిశీలించారు. నామినేషన్కు జత పరుస్తున్న ధ్రువీకరణ పత్రాల వివరాలను రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు తప్పనిసరిగా జాతీయ బ్యాంకులో ఖాతా తీసుకోవాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున బ్యాంకుఖాతా పాసుపుస్తకం వివరాలను అందించాలన్నారు. ఎంపీవో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.


